అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం తీరాన్ని ఒక యోగా పండుగ వేదికగా మార్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
“యోగాంధ్ర-2025” పేరుతో సముద్రతీరంలో యోగాసనాలు వేయించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో 26 కిలోమీటర్ల పరిధిలో 3.19 లక్షల మంది పాల్గొనే విధంగా సన్నాహాలు పూర్తయ్యాయి. “యోగా ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో రికార్డు స్థాయిలో ప్రజలు యోగా డేలో పాల్గొననున్నారు. ఆ ఈవెంట్ కు ఇంక ఒక్కరోజే దూరం. #Yogandhra#InternationalYogaDay… pic.twitter.com/m6HagfxNJw
— Telugu Desam Party (@JaiTDP) June 20, 2025
గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నం:
ఈ కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజలంతా యోగాను జీవిత భాగంగా చేసుకోవాలన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణా కోర్సులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ యోగా మ్యాట్, టీషర్ట్:
ఈ వేడుకలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా యోగా మ్యాట్, టీషర్ట్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు విశాఖ నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ముస్తాబైంది. 2వేలకుపైగా సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్, రెడ్ జోన్లుగా ప్రకటించారు.
#Yogandhra2025
Andhra Pradesh is ready for a historic celebration!I warmly welcome Hon’ble Prime Minister Shri @narendramodi ji to Andhra Pradesh for the 11th International Day of Yoga celebrations at RK Beach, Visakhapatnam.
Over 2 crore people will join this movement across… pic.twitter.com/bVgV7wf5GU
— N Chandrababu Naidu (@ncbn) June 20, 2025
SPG భద్రతలో ప్రధాని వేదిక:
ప్రధాని మోదీ పాల్గొనబోయే వేదికను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) తమ అదుపులోకి తీసుకుంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ ఏర్పాట్లు చేపట్టారు. చిన్న అనుమానం ఉన్న.. ట్రాఫిక్ జామ్ అయినా వెంటనే అధికారులకు సమాచారం వెళ్లేలా వ్యవస్థ రూపొందించారు.