ఏపీ రాజకీయాల్లో పుష్పరాజ్ స్టైల్లో “రప్పా.. రప్పా..” డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ ఇలా మూడూ రకాల రాజకీయ నేతల నోట ‘రప్పా రప్పా’ విందాము అన్నట్టుగా వినిపించడంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు. “సినిమాలో చెప్పే డైలాగ్లు సినిమా హాల్ వరకే బాగుంటాయి. వాటిని వాస్తవంగా ఆచరణలో పెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు” అని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని గౌరవించాల్సిందేనని, నియమ నిబంధనలకు లోబడి ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుందని పవన్ గుర్తుచేశారు.
అసాంఘిక శక్తులకు కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు
గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, “శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. అందుకే అలాంటి అసాంఘిక శక్తులపై రౌడీషీట్లు తెరిచి కఠినంగా వ్యవహరిస్తాం” అని తెలిపారు.
చట్ట విరుద్ధంగా ప్రవర్తించడాన్ని బహిరంగంగా ప్రదర్శించే వారిని సమర్థించేవారిపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. “అలాంటి వారి ఆలోచనలు కూడా నేరమే. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అన్న విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు” అంటూ పవన్ గట్టిగా వ్యాఖ్యానించారు.