వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది. ఏకంగా రూ.3,000 చెల్లించి సంవత్సరానికి గరిష్ఠంగా 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం ఈ పాస్ ద్వారా లభిస్తుంది. ఈ కొత్త విధానం ఆగస్టు 15, 2025 నుండి అమలులోకి రానుంది.
టోల్ పేమెంట్ను మరింత సులభతరం చేయడానికి ఈ ప్లాన్
టోల్ గేట్ల వద్ద తరచూ ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కీలక నిర్ణయం ప్రకటించారు. “సింగిల్ రీచార్జ్తో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకూ ప్రయాణించవచ్చు. ఇది వ్యక్తిగత వాహనదారులకు పెద్ద రిలీఫ్,” అని ఆయన వివరించారు.
ఎవరికి ఉపయోగపడుతుంది?
ఈ వార్షిక పాస్ ముఖ్యంగా వ్యక్తిగత వాహనాలు (కార్లు, జీపులు, వ్యాన్లు) కోసం రూపొందించబడింది. వాణిజ్యేతర ప్రయాణికులు దీన్ని ఉపయోగించవచ్చు. టోల్ ప్లాజాల వద్ద తరచూ ఎదురయ్యే నిలిపివేతలు, క్యాష్ లావాదేవీల అవాంతరాలు ఇక పోతాయని కేంద్రం ఆశిస్తోంది.
Important Announcement 📢
🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…
— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025
ఫీచర్లు:
రూ.3,000లో సంవత్సరానికి 200 ట్రిప్పులు
దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై వర్తింపు
ఒకే సారి రీచార్జ్-ప్రయాణ సమయంలో నిలిపివేత లేకుండా టోల్ గేట్ దాటే వీలుతో
రద్దీ తగ్గింపు, వేచి ఉండే సమయం కూర్పు
యాక్టివేషన్, రెన్యూవల్ ఎలా?
ఈ ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ను ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్, NHAI, మరియు MoRTH అధికారిక వెబ్సైట్లు ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. త్వరలో ప్రత్యేక లింక్లు విడుదల చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.
ఇక ఆలస్యం ఎందుకు? టోల్ రోడ్లను తరచూ ఉపయోగించే వారు వెంటనే ఈ కొత్త వార్షిక పాస్కి సిద్ధం అవ్వండి..!