క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్లో భారత జట్టు పాకిస్తాన్తో తలపడనుంది. తాజాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు సంబంధించి వేదిక, తేదీ వంటి వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో మొదటి మ్యాచ్ ఆడనుంది.
అక్టోబర్ 5న హైవోల్టేజ్ భారత్ vs పాక్ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. భారత్ బంగ్లాదేశ్తో అక్టోబర్ 26న బెంగళూరులో తలపడనుంది. ఇదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా అక్టోబర్ 1న ఇండోర్లో న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న పాకిస్తాన్తో, అక్టోబర్ 22న ఇంగ్లాండ్తో తలపడనుంది.
🚨 India’s Cricket World Cup 2025 schedule
▶️ Opening game against Sri Lanka in Bengaluru
▶️ 2️⃣x Bengaluru & Vishakapatnam, 1️⃣ each in Indore & Guwahati
▶️ Pakistan match in Colombo#CricketWorldCup pic.twitter.com/f8mujqC5hZ— Women’s CricZone (@WomensCricZone) June 16, 2025
ఇతర కీలక షెడ్యూల్ ఇలా ఉంది:
పాకిస్తాన్ మ్యాచ్లు (అన్నీ కొలంబోలో):
అక్టోబర్ 2: బంగ్లాదేశ్
అక్టోబర్ 5: భారత్
అక్టోబర్ 15: ఇంగ్లాండ్
అక్టోబర్ 18: న్యూజిలాండ్
అక్టోబర్ 21: దక్షిణాఫ్రికా
అక్టోబర్ 24: శ్రీలంక
ఇంగ్లాండ్ మ్యాచ్లు:
అక్టోబర్ 3: దక్షిణాఫ్రికా (బెంగళూరు)
అక్టోబర్ 11: శ్రీలంక (గౌహతి)
అక్టోబర్ 26: న్యూజిలాండ్ (గౌహతి)
దక్షిణాఫ్రికా మ్యాచ్లు:
అక్టోబర్ 6: న్యూజిలాండ్ (ఇండోర్)
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా (ఇండోర్)
బంగ్లాదేశ్ మ్యాచ్లు:
అక్టోబర్ 2: పాకిస్తాన్
మిగతా మూడు మ్యాచ్లు విశాఖపట్నం & కొలంబోలో
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా, పాక్ మ్యాచ్లన్నీ తటస్థ వేదిక అయిన కొలంబోలో జరగనున్నాయి. ఇదివరకు భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్లో ఆడగా, పాక్ బదులుగా భారత్లో జరిగే టోర్నీల్లో పాల్గొనదని ప్రకటించింది.
టోర్నీ కీలక తేదీలు:
మొత్తం లీగ్ మ్యాచ్లు: 28
సెమీ ఫైనల్స్: అక్టోబర్ 29 (గౌహతి), అక్టోబర్ 30 (బెంగళూరు)
ఫైనల్: నవంబర్ 2 (బెంగళూరు లేదా కొలంబో)
గమనిక: పాక్ సెమీకి చేరితే, గౌహతి మ్యాచ్ కొలంబోకి మారుతుంది.