Manchu Lakshmi: ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి ప్రయాణం.. ప్రమాదంపై షాకింగ్ రియాక్షన్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోవడంతో 274 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తుండగా, టాలీవుడ్ నటి మంచు లక్ష్మి చేసిన ఒక పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచు లక్ష్మి షాకింగ్ పోస్టు:
తాను కూడా అదే రోజు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించానని మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపింది. అయితే తాను అహ్మదాబాద్‌ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కు వెళ్లానని స్పష్టం చేసింది. ‘‘ఈ రోజు లండన్‌కి ఎయిరిండియా ఫ్లైట్‌లో ప్రయాణించాను. ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాద వార్త విని షాక్ అయ్యాను. ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో చూస్తే గుండె పగిలిపోతుంది. ముఖ్యంగా రెసిడెంట్ డాక్టర్లు మరణించారన్న విషయం మరింత బాధ కలిగించింది. దేవుడు గొప్పవాడు. ఈ రోజు జీవితం విలువ ఎంత అనర్థంగా మారిపోయిందో ఈ సంఘటన చెబుతోంది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.’’ అంటూ ఆమె తెలిపింది.

నిజం చెప్పేందుకు వీడియో షేర్ చేసిన లక్ష్మి:
ఈ ప్రమాద వార్తల మధ్య, తాను కూడా అదే ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించానన్న విషయంతో నెటిజన్లలో ఆందోళన మొదలైంది. చాలా మంది కాల్స్ చేసి మంచు లక్ష్మి క్షేమంగా ఉన్నారా అని తెలుసుకున్నారు. దీంతో తాను సురక్షితంగా లండన్ చేరుకున్నానని, తన ప్రయాణ మార్గం అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్‌కి అని స్పష్టం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

ఒకవైపు ఘోర విమాన ప్రమాదం, మరోవైపు అదే ఎయిర్‌లైన్‌లో ప్రయాణించిన నటిని చూసిన అభిమానుల స్పందన.. ప్రస్తుతం మంచు లక్ష్మి వీడియోపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Leave a Reply