తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇంతకు ముందు మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపగా, అప్పటికే అమెరికాలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉండటంతో హాజరు కాలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తన విదేశీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన నేపథ్యంలో మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి: విమాన ప్రమాదంలో ఒకే కుటుంబం మృతి.. చివరి సెల్ఫీ ఇప్పుడు వైరల్
కేటీఆర్ ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. “చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, రాజకీయ దాడుల నేపథ్యంలో వచ్చినా ఏసీబీకి పూర్తి సహకారం అందిస్తాను. కానీ మే 28న నేను యూఎస్, యూకే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. రాగానే విచారణకు హాజరవుతానని లిఖితపూర్వకంగా తెలియజేశాను” అంటూ ట్వీట్ చేశారు.
అయితే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో తన పర్యటనను అర్థాంతరంగా ముగించి కేటీఆర్ దేశానికి తిరిగివచ్చారు. దీంతో ఏసీబీ అతడిని మళ్లీ విచారణకు పిలిచే అవకాశముంది.
ఇవి కూడా చదవండి: ఎలా బతికి బయటపడ్డానో ఇప్పటికీ అర్థం కావడం లేదు.. ప్రధాని మోదీతో రమేష్..!
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా (A1), సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను (A2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని (A3) ఏసీబీ విచారించింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని అప్పటికే అధికారులు పేర్కొన్నారు. అప్పటి తర్వాత కేసు విషయమై పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మళ్లీ నోటీసులు రావడంతో విచారణ వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.