జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్కు సుప్రీంకోర్టు నుండి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశ్లేషకుడి అభిప్రాయాలను కొమ్మినేనిపై అపార్థంగా మోపటం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
‘‘అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని’’ అంటూ సాక్షి టీవీలో జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై కొమ్మినేని శ్రీనివాస్, వీవీఆర్ కృష్ణంరాజు, సాక్షి టీవీపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది.
#YCPinsultsWomen
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే… pic.twitter.com/d4Pvmqy2AE— Lokesh Nara (@naralokesh) June 7, 2025
ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేయగా, మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం నాడు ఆయన విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇక మరోవైపు, వీవీఆర్ కృష్ణంరాజును కూడా జూన్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా మరియు మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.