Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 242 మంది మృతి.. సీపీ సంచలన ప్రకటన..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి కారణమైంది. ఈ దుర్ఘటనపై అహ్మదాబాద్‌ సీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణించిన 242 మంది ప్రయాణికులంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఒక్కరైనా ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు.

విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీసు దేశస్థులు, ఒక కెనడియన్ ప్రయాణికుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లేందుకు బయలుదేరిన క్రమంలో.. టేకాఫ్ అయిన కేవలం 5 నిమిషాల్లోనే మేఘానీనగర్‌లో కుప్పకూలింది.

మధ్యాహ్నం 1:39 గంటలకు విమానం ఎగరగా.. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ స్పందన వచ్చేముందే, 1:43కి విమానం భూమిని ఢీకొని భారీ పేలుడుతో మంటల్లో ఆహుతైంది. ఘటన స్థలంలో రెస్క్యూ సిబ్బంది కొనసాగిస్తున్న ప్రయత్నాల మధ్య తీవ్ర విషాదకర దృశ్యాలు కనపడుతున్నాయి.

Leave a Reply