తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. క్యాబినెట్లో ఉన్న ఆరు ఖాళీల్లో ముగ్గురికి మాత్రమే మంత్రిపదవులు ఇచ్చారు. తాజాగా ఈ ముగ్గురికి శాఖలు కేటాయించారు. రేపు వీరు తమ శాఖల బాధ్యతలు స్వీకరించనున్నారు.
శాఖల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొనగా, సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త మంత్రుల సామాజిక నేపథ్యం, అనుభవం, అవగాహనలను పరిగణనలోకి తీసుకొని శాఖలు కేటాయించినట్టు సమాచారం. తానిప్పటివరకు చూసుకుంటున్న కొన్ని శాఖలనే ఆయన వారి వద్ద అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇవే కొత్త మంత్రుల శాఖలు:
గడ్డం వివేక్ వెంకటస్వామి – కార్మిక శాఖ, మైనింగ్ శాఖ
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ
వాకిటి శ్రీహరి – పశుసంవర్ధక శాఖ, క్రీడలు మరియు యువజన శాఖ
ఈ రోజు శాఖల కేటాయింపు అనంతరం రేపు వీరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం తెలంగాణ సెక్రటేరియట్లో తగిన విధంగా వారి చాంబర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖను ఆదేశించింది.