తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టికెట్ మాఫియా, అనధికారిక ఏజెంట్ల నియంత్రణకు ఉద్దేశించి జూలై 1 నుంచి ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేయాలంటే, ముందుగా ఆధార్ ఆధారిత అథెంటికేషన్ పూర్తిచేయాలి.
జూలై 15 నుంచి ఓటీపీ కూడా తప్పనిసరి
ఆధార్ ధృవీకరణతో పాటు, జూలై 15 నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన కౌంటర్లు, అధికారిక ఏజెంట్ల బుకింగ్లకూ వర్తిస్తుంది. తత్కాల్ బుకింగ్ సమయంలో మొదటి 30 నిమిషాలు అధికారిక ఏజెంట్లకు టికెట్ బుకింగ్ అనుమతి ఉండదు. తద్వారా సాధారణ ప్రయాణికులకు మొదట టికెట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఏసీ టికెట్లు – ఉదయం 10:30 గంటల తర్వాత
నాన్-ఏసీ టికెట్లు – ఉదయం 11:30 గంటల తర్వాత మాత్రమే బుకింగ్ ప్రారంభమవుతుంది.
వెయిటింగ్ టికెట్లకు ముందస్తు సమాచారం
వెయిటింగ్ లిస్ట్ టికెట్ల గురించి ట్రైన్ బయల్దేరే నాలుగు గంటల ముందు స్టేటస్ తెలుసుకోవచ్చును. అయితే రైల్వే శాఖ ప్రయాణికుల అనిశ్చితిని తగ్గించేందుకు 24 గంటల ముందే టికెట్ స్థితిగతులపై సమాచారం ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ విధానాన్ని బికనీర్ డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు.