తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త పీసీసీ కార్యవర్గం ప్రకటించబడింది. ఇందులో మొత్తం 96 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు.
ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కొత్త జాబితాలో ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య లాంటి కీలక నేతలు ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు.
Hon’ble Congress President has approved the proposal for the appointment of Vice
Presidents and General Secretaries of the Telangana Pradesh Congress Committee,
as enclosed, with immediate effect. pic.twitter.com/0F8CRtZmhu— Telangana Congress (@INCTelangana) June 9, 2025
అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, పర్నిక రెడ్డి, రాగమయి తో పాటు మరికొంతమంది యువ నాయకులకు చోటు కల్పించడం విశేషం. ఈ కొత్త పీసీసీ నిర్మాణం ద్వారా పార్టీకి నూతన శక్తి రావడం ఖాయం అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.