MS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ధోనీ.. భారత క్రికెటర్లలో ఒకే ఒక్కడు..!

భారత క్రికెట్‌కు మరో గర్వకారణమైన ఘనత దక్కింది. భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. ఈ గౌరవం పొందిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఏడుగురు క్రికెటర్లకు స్థానం కల్పించగా, ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు.

ప్రతిష్టాత్మక జాబితాలో ధోనీ ప్రాతినిధ్యం

ఈ జాబితాలో ధోనితో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజులు గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ లెజెండ్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి ఉన్నారు. మహిళా క్రికెటర్ల విభాగంలో పాకిస్తాన్ స్టార్ సనా మిర్, ఇంగ్లాండ్ క్రికెటర్ సారా టేలర్ చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ ఛైర్మన్ జైషా ప్రకటన

హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను ఐసీసీ ఛైర్మన్ జై షా అధికారికంగా ప్రకటించారు. “క్రికెట్‌లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన ఆటగాళ్లను గౌరవించేందుకు వీరిని హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఆహ్వానిస్తున్నాం. వీరి విజయాలు భవిష్యత్తు తరాల ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాయి” అని ఆయన తెలిపారు.

ధోనీ – భారత క్రికెట్ చరిత్రలో అపురూప అధ్యాయం

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంది – 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ. అతడు అన్ని ఫార్మాట్ల కలిపి టీమ్ ఇండియా తరఫున 538 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 17,266 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 829 ఔట్లకు (క్యాచ్‌లు, స్టంపింగ్స్) పాల్పడ్డాడు. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

Leave a Reply