ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న EAPCET 2025 ఫలితాలు చివరకు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది (75.67%) ఉత్తీర్ణత సాధించారు.
పరీక్షల వివరాలు:
ఇంజినీరింగ్ విభాగం:
మే 21 నుంచి 27 వరకు 10 సెషన్లలో పరీక్ష
హాజరైన విద్యార్థులు: 2,64,840
ఉత్తీర్ణత సాధించిన వారు: 1,89,748 (71.65%)
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం:
మే 19, 20 తేదీల్లో 4 సెషన్లలో పరీక్ష
హాజరైన విద్యార్థులు: 75,460
ఉత్తీర్ణత సాధించిన వారు: 67,761 (89.80%)
ఈ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో నిర్వహించింది. మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
ఇంజినీరింగ్ టాపర్స్:
అనిరుధ్ రెడ్డి (హైదరాబాద్)
భాను చరణ్ రెడ్డి (శ్రీకాళహస్తి)
యశ్వంత్
రామ్ చరణ్ రెడ్డి (నంద్యాల జిల్లా)
భూపతి నితిన్ (అనంతపురం)
అగ్రి, ఫార్మసీ టాపర్స్:
సాయి హర్షవర్ధన్ (పెనమలూరు)
నిశాంత్ రెడ్డి (రంగారెడ్డి)
వినయ్ మల్లేశ్ (కోనసీమ)
షణ్ముఖ్ (హనుమకొండ)
సాయి గోవర్ధన్ (కాకినాడ)
ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (Step-by-Step):
అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in కి వెళ్లండి
హోమ్పేజ్లో “AP EAPCET 2025” లింక్పై క్లిక్ చేయండి
Results లింక్ను సెలెక్ట్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
View Result క్లిక్ చేయండి
స్క్రీన్పై మార్క్ మెమో కనిపిస్తుంది.. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి
మొదటి 12 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం APSCHE ఆధ్వర్యంలో ఇదొక సరికొత్త వేగవంతమైన చర్యగా నిలిచింది. ఫలితాలను ‘APSCHE myCET’ యాప్లో కూడా చెక్ చేయవచ్చు.