దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, భారత్లో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 2,710కి చేరింది. ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మందికి కోమోర్బిడిటీస్ (ఇతర అనారోగ్య పరిస్థితులు) ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కేసుల ఉధృతి.. కేరళలోనే ఎక్కువ
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో ఉన్నాయి. అక్కడ 1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. 1,170 మంది కరోనా బారిన పడినవారు డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కోమోర్బిడిటీల కారణంగా మరణాలు
రాష్ట్రాల వారీగా వివరాల్లోకి వెళ్తే:
ఢిల్లీ: లాపరోటమీ తరువాత పేగు వ్యాధితో 60 ఏళ్ల మహిళ మృతి.
గుజరాత్: ఒక మరణం నమోదు.
కర్ణాటక: కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్తో మరణం.
మహారాష్ట్ర: రెండు మరణాలు. వీరికి డయాబెటిస్, హైపర్టెన్షన్, సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లాంటి సమస్యలు ఉండేవి.
పంజాబ్: హెపటైటిస్ బి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో 39 ఏళ్ల వ్యక్తి మృతి.
తమిళనాడు: CKD, T2DM, HTN ఉన్న వృద్ధుడు మరణించాడు.
కేంద్రం అప్రమత్తం
ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆరోగ్య సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడించారు. గత వేవ్ సమయంలో ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు.