kavitha vs KTR: కేటీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు ఒక్క నాయకుడు మాత్రమే ఉన్నాడని, అది కేసీఆర్‌నేనని స్పష్టం చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పార్టీని తనే నడుపుతున్నట్లు చెప్పుకునేవారిని నేరుగా ప్రశ్నించారు.

కేసీఆర్‌నే నా నాయకుడు
బీఆర్ఎస్‌లో తన నాయకుడు ఒక్కరే, ఆయన కేసీఆర్ మాత్రమేనని, ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని కవిత స్పష్టం చేశారు. పార్టీని నడిపించే సత్తా ఉన్నవాళ్లు నీతులు చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను నడిపిస్తున్నామని చెప్పేవాళ్లు నిజంగా ఆయన కన్నా గొప్పవాళ్లా? అని ప్రశ్నించారు.

చిచోరా రాజకీయాలు చేయను
కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వాళ్లు, ఇంకో నేతకు నోటీసులు వస్తే హంగామా చేయడం ఎందుకోనని కవిత ప్రశ్నించారు. తాను హుందాగా రాజకీయాలు చేస్తానని, చిచోరా రాజకీయాలకు తాను దూరమని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కావాలనే తనను ఓడించారని ఆరోపించారు. పార్టీ పనుల్లో తానే ముందుండి చేస్తున్నానని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని సూచించారు.

బీజేపీకి బీఆర్ఎస్ విలీనం ప్రయత్నం?
తాను జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న చర్చలు జరిగాయని, కానీ తాను ఒప్పుకోలేదని కవిత వెల్లడించారు. తనను కేసీఆర్‌కు దూరం చేయాలని కుట్ర జరుగుతోందని వాపోయారు. తాను కేసీఆర్‌లాగే తిక్కదానిని, పదవులు, పైసలకు తలవంచనని తేల్చి చెప్పారు.

రాజీనామా విషయంపై సంచలన నిజం
ఢిల్లీ లిక్కర్ కేసు సమయంలో తాను కేసీఆర్ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తానని చెప్పానని, అయితే కేసీఆర్ మాత్రం “నీపై కోపంతోనే ఈ కేసు పెట్టారు, రాజీనామా వద్దు” అని చెప్పారని వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో తన గెలుపుకోసం ఎమ్మెల్యేలు పనిచేయలేదని చివరికి కేసీఆర్‌నే చెప్పారంటూ సంచలన ఆరోపణ చేశారు.

ఇది కూడా చదవండి :

గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన జ్యూరీ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్..!
ఫైనల్స్‌కు చేరేది ఎవరు? క్వాలిఫయర్ 1లో ఈరోజు బెంగళూరు vs పంజాబ్

Leave a Reply