తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. సంబంధిత డిటెయిల్స్ నమోదు చేసి, వ్యక్తిగత ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాల లింక్: 🔗 https://www.polycet.sbtet.telangana.gov.in
ఈ ఏడాది పరీక్షకు 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది హాజరయ్యారు. మొత్తం 80,949 మంది ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 81.88% గా నమోదైంది.
ఫస్ట్ ర్యాంక్లో నలుగురు విద్యార్థులు
హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యా భవన్లో టీజీ పాలిసెట్ 2025 ఫలితాలను సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన విడుదల చేశారు. ఈసారి నలుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం విశేషం. కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారి పాలిసెట్ సీట్లు కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ కోర్సులు – విద్యార్థులకు ప్రయోజనాలు
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ప్రాక్టికల్ పరిజ్ఞానం గల ఇంజినీరింగ్ విద్యను పొందవచ్చు. కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాక ఏఎంఐఈ, ఐఐసీఈ, గ్రేడ్-ఐఈటీఈ లాంటి ఇంజినీరింగ్కు సమానమైన కోర్సుల్లో నమోదు అయ్యి, ఉద్యోగం చేస్తూనే విద్య కొనసాగించవచ్చు.
తరువాత విడుదల కానున్న టీజీ ఈసెట్ ఫలితాలు
తెలంగాణ ఈసెట్ 2025 పరీక్ష మే 12న నిర్వహించబడింది. పాలిటెక్నిక్ మరియు B.Sc (Maths) విద్యార్థులకు బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ అవకాశం కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 19,672 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసెట్ ఫలితాలు కూడా కొన్ని రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.