భారతదేశపు అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ మొట్టమొదటిసారిగా TIME100 దాతృత్వ (ఫిలాంథ్రఫీ) జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025 సంవత్సరానికి గాను విడుదలైన ఈ ప్రెస్టీజియస్ జాబితాలో వీరు రూ.407 కోట్ల విరాళంతో స్థానం సంపాదించారు.
ఇది అంబానీ దంపతుల కోసం గౌరవప్రదమైన అవకాశం కావడమే కాకుండా, భారతదేశం తరపున వారి సహకారానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిన సందర్భం. వీరి విరాళాల ప్రధాన ఉద్దేశ్యం విద్య, ఆరోగ్యం మరియు గ్రామీణాభివృద్ధి రంగాల్లో మార్పును తీసుకురావడమే.
ఇతర భారతీయుల గురించి కూడా ప్రస్తావన:
ఈ జాబితాలో ఇతర భారతీయులుగా విప్రో సంస్థ మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కూడా చోటు దక్కించుకున్నారు.
అజీమ్ ప్రేమ్జీ గారు 25 ఏళ్ల క్రితమే ఫౌండేషన్ ప్రారంభించి, దాదాపు 29 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విరాళంగా ఇచ్చారు. 2024లో రూ.950 కోట్ల విరాళాలు అందించారు.
నిఖిల్ కామత్ 36 ఏళ్ల వయస్సులోనే గివింగ్ ఫెడ్జ్పై సంతకం చేసిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. విద్యారంగానికి విరాళాలు అందించడంలో ముందున్నారు.
TIME మ్యాగజైన్ తరఫున తయారుచేసిన ఈ జాబితాలో భారతీయుల పాత్ర మరింత బలంగా కనిపించింది. సేవా కార్యక్రమాల పట్ల అంబానీ దంపతుల నిబద్ధతను ఇది స్పష్టంగా చాటుతోంది.