తెలుగు ప్రేక్షకులకు పందెం కోడి, భరణి, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ వంటి సూపర్ హిట్ సినిమాల ద్వారా పరిచయమైన కోలీవుడ్ హీరో విశాల్కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవలే రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన, సినీ రంగం లోపల, వెలుపల వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విశాల్ ఇటీవల అనారోగ్యంతో వార్తల్లోకి వచ్చారు. బక్కచిక్కిన రూపం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలతో అభిమానులను కలవరపరిచిన ఆయన, తాజాగా శుభవార్త చెప్పాడు.
ఎప్పటి నుంచో వార్తల్లో ఉండే ఆయన పెళ్లి విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చింది. నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు విశాల్ స్వయంగా ప్రకటించారు. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో, ధన్సికతో తన వివాహం ఆగస్టు 29న జరగనుందని వెల్లడించారు. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Tamil hero #Vishal announced his marriage with #SaiDhanshika ! pic.twitter.com/4K6cYV1jbg
— North East West South (@prawasitv) May 20, 2025
ధన్సిక తెలుగు ప్రేక్షకులకు షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి సినిమాల ద్వారా పరిచయం. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలిలో కూతురిగా ఆమె ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె తమిళ్లో యాక్టివ్గా సినిమాలు చేస్తోంది.
విశాల్కు, ధన్సికకు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.