ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ జోడీ 200 పరుగుల వరకూ వికెట్ కోల్పోకుండా నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై ఘన విజయం సాధించి డైరెక్ట్గా ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. ఈ విజయంలో ఓపెనర్ల పాత్ర కీలకం.
ఓపెనర్ల సంచలనం – 200 పరుగుల రికార్డు
ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (108), శుభ్మన్ గిల్ (93) నాటౌట్గా నిలిచి మరో బ్యాటర్కు అవకాశమే ఇవ్వలేదు. ఈ దాంతో ఐపీఎల్ చరిత్రలో వికెట్ కోల్పోకుండా 200కు పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది.
A Complete dominated wins for Gujarat Titans. Chase 200 Runs without a loss of Wickets in 19 Overs 🤯
Best Opening duo of this Season. Not playing risky shot, plays proper Cricketing Shots. Best team of this Season 🔥 #DCvsGT pic.twitter.com/xp9ipWXaED
— VIKAS (@VikasYadav69014) May 18, 2025
గత రికార్డును అధిగమించిన గుజరాత్
ఇంతకుముందు ఈ రికార్డు కోల్కతా నైట్ రైడర్స్ పేరిట ఉండేది. 2017 సీజన్లో గుజరాత్ లయన్స్పై కోల్కతా వికెట్ కోల్పోకుండా 184 పరుగులు చేసింది. కానీ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఆ రికార్డును చెరిపేసింది.
ఇక ఈ సీజన్లో గిల్, సుదర్శన్ ఓపెనింగ్ జోడీ కలిపి ఇప్పటి వరకు 839 పరుగులు చేయడం గమనార్హం. వీరి తర్వాత శిఖర్ ధావన్, పృథ్వీ షా జోడీ (744 పరుగులు) నిలిచింది.