మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్న చిరు, ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో మేకర్స్ స్పష్టత ఇచ్చారు.
విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్. మెగాస్టార్ సరసన ఎవరు హీరోయిన్గా కనిపిస్తారనే ఉత్కంఠకు చెక్ పెడుతూ.. లేడీ సూపర్ స్టార్ నయనతారను అధికారికంగా అనౌన్స్ చేశారు. మేకర్స్ ప్రత్యేకంగా నయన్పై రూపొందించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేస్తూ ఈ అప్డేట్ ప్రకటించారు.
Welcome back for the hatrick film #Nayanthara!
Glad to have you on board for our #Mega157 journey with @anilravipudi.
SANKRANTHI 2026 రఫ్ఫాడించేద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt https://t.co/2faZXKNYaq
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2025
నయనతార-చిరంజీవి కాంబో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి చిత్రంలో హిట్ జోడిగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ జంట తెరపై కనిపించబోతోంది అన్న విషయమే అభిమానులను ఉత్సాహపరుస్తోంది.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించబోతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరు-అనిల్-నయన్ కాంబినేషన్లో పక్కా మాస్, ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుందన్న అంచనాలు ఫ్యాన్స్లో పెరిగిపోతున్నాయి.