పద్మభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ ఓ ఆల్కహాల్ బ్రాండ్కు సంబంధించిన ప్రకటనలో కనిపించడం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. బాలయ్య మాన్సన్ హౌస్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ నటించిన యాడ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య మాన్సన్ హౌస్ వాటర్ బాటిల్ ప్రకటనలో కనిపించారు. ఇది నిజానికి లిక్కర్ బ్రాండ్కు చెందిన సరోగేట్ యాడ్. అంటే, నేరుగా మద్యం ప్రకటన చేయకుండా వాటర్ బాటిల్ పేరుతో ఆ బ్రాండ్ను ప్రజల్లో గుర్తింపు తెచ్చే ప్రయత్నం. ఇదే కారణంగా బాలయ్యపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
Padma Bhushan Balakrishna Officially Signs On as Brand Ambassador for ‘Mansion House’.pic.twitter.com/IeeQXvb9fT
— ZAYN 🇮🇳 (@chiruthajsp) May 15, 2025
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుతో గౌరవించబడిన బాలయ్య ఇలాంటి మద్యం బ్రాండ్లను ప్రోత్సహించడం ఏ మాత్రం తగదని నెటిజన్లు మండిపడుతున్నారు. యువతపై ప్రభావం చూపే వ్యక్తిగా ఉండే ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.
భారతదేశంలో మద్యం, పొగాకు ఉత్పత్తులపై నేరుగా యాడ్స్ ఇవ్వడం చట్టపరంగా నిషిద్ధం. అందుకే బ్రాండ్లు తమ మద్యం ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు ‘సరోగేట్ అడ్వర్టైజింగ్’ను వాడతాయి. వాటర్ బాటిల్స్, సోడా, మ్యూజిక్ CDs పేరుతో ఈ ప్రకటనలు చేస్తుంటారు. బాలయ్య నటించిన యాడ్ కూడా ఇదే తరహాలో ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
మ్యాన్షన్ హౌస్ అంబాసిడర్గా బాలకృష్ణ #NBK #MansionHouse pic.twitter.com/ngcbVwfVaW
— Milagro Movies (@MilagroMovies) May 15, 2025
ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం ఒకే మాట చెబుతున్నారు – “ఇదేం పని బాలయ్య?”