India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ: అధికారికంగా యుద్ధానికి బ్రేక్!

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. వెంటనే భారత్ ప్రభుత్వం స్పందించి, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పులు ఆపేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ సమాచారం నిజమని ధృవీకరించారు.

ఈ నిర్ణయానికి ముందు శనివారం మధ్యాహ్నం 3:35కు పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓతో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరు దేశాల సైనికాధికారులు మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ మాట్లాడనున్నారు. ఈ శాంతి సంకేతాన్ని నెటిజన్లు, అంతర్జాతీయంగా ప్రశంసలతో స్వాగతిస్తున్నారు.

భవిష్యత్తులో ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి మార్గం వేస్తుందని ఆశిస్తున్నారు.

Leave a Reply