టెక్ రంగంలో మరోసారి ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది గూగుల్. 2025లో మూడోసారి ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ, తాజాగా ‘గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్’ యూనిట్లో పనిచేస్తున్న 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. కృత్రిమ మేథ (AI) దిశగా సంస్థ వ్యూహాలను మళ్లించుకుంటున్న తరుణంలో, ఇది కీలక మార్పుగా పరిశీలిస్తున్నారు.
గతంలోనూ Android, Pixel, Chrome విభాగాల్లో గూగుల్ లేఆఫ్స్కు శ్రీకారం చుట్టగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కొన్ని వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ ‘గ్లోబల్ బిజినెస్’ విభాగంపై దృష్టి సారించి, అక్కడ ఉన్న ఉద్యోగులను బయటకు పంపించింది. ఈ యూనిట్ గూగుల్ అమ్మకాలు, వ్యాపార భాగస్వామ్యాలు వంటి కీలక వ్యవహారాలను పర్యవేక్షించేది.
As Big Tech doubles down on AI and infrastructure, Google trims its global business unit workforce in the latest wave of job cuts across the industry.https://t.co/6VsB5EXeCt pic.twitter.com/g7RDKzlqiI
— Storyboard18 (@BrandStoryboard) May 8, 2025
గూగుల్ spokesperson మాట్లాడుతూ – “మేము మా వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని చిన్న మార్పులు చేస్తూ, కస్టమర్ సర్వీస్ మెరుగుపరిచే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. అయితే అసలు విషయం ఏంటంటే, గూగుల్ సహా ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీలు ఇప్పుడు ఏఐ, డేటా సెంటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై దృష్టి పెట్టడంతో, మానవ వనరులను తగ్గించడం ద్వారా ఖర్చు నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి.
గతంలో Alphabet సంస్థ 2023లో 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయాన్ని మరిచిపోలేం. అది సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6 శాతం. ప్రస్తుతం గూగుల్లో సుమారు 1.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఉద్యోగుల భద్రతపై రోజురోజుకీ పెరుగుతున్న అనిశ్చితి.. ఎప్పుడైనా లేఆఫ్ అయ్యే ప్రమాదం ఉన్న ఈ టెక్ రంగం ఉద్యోగులకు ఇక భవిష్యత్ పట్ల భయం పెంచేలా చేసింది.