పహల్గాం ఉగ్రదాడికి కఠినమైన ప్రతీకారం తీర్చుకుంటూ భారత సైన్యం ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ ఆపరేషన్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
26 మంది అమాయక పౌరులను కోల్పోయిన దేశం, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాద శిబిరాలపై సమన్వయ దాడులు చేసి, అంతర్జాతీయంగా తమ ప్రతాపాన్ని చూపింది. గాఢ నిద్రలో ఉన్న పాక్ భూభాగంపై భారత వాయుసేన క్షిపణులతో విరుచుకుపడింది. సైనిక పరంగా కాదు, మానసికంగా కూడా ఇది పాకిస్తాన్కు భారీ దెబ్బ.
తెల్లవారుజామున 1:44కి ప్రారంభమైన ఆపరేషన్ కేవలం 23 నిమిషాల్లో ముగిసింది. జైషే మహ్మద్, లష్కరే తోయ్బా వంటి ఉగ్ర సంస్థల శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో పాక్వైపు నుంచి ఎటువంటి ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. కనీసం ఒక విమానం కూడా హవాలోకి రాలేదు. ఇది భారత సైన్య ప్రణాళికా నైపుణ్యానికి నిదర్శనం.
ముజఫరాబాద్, బహావల్పూర్, కోట్లి, చక్ అమ్రు, గుల్పూర్, భింబర్, మురిడ్కే, సియాల్కోట్ వంటి ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలువురు టాప్ టెర్రరిస్ట్ లీడర్లు హతమయ్యారు. పాక్ మాత్రం వ్యర్థ ప్రచారాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదే సమయంలో సరిహద్దుల్లో పాక్ జరుపుతున్న కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించారు. ఈ చర్యలు పాక్ ఉన్మాదానికి నిదర్శనంగా మారాయి.
భవిష్యత్తులో ఎలాంటి స్పందన వచ్చినా తిప్పి కొట్టేందుకు భారత ప్రభుత్వం, సైన్యం సిద్ధంగా ఉంది. అన్ని విభాగాల్లోని సివిలియన్ డిఫెన్స్ అధికారులను కూడ ఇప్పటికే విధుల్లోకి పిలిపించింది. ఇది భారత్కు ‘మాటకంటే పని ముఖ్యమని’ మరోసారి రుజువు చేసింది.