Ajith Kumar-Padma Bhushan: హీరో అజిత్ కుమార్‌కు పద్మభూషణ్ పురస్కారం..!

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్‌కు భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ లభించింది. ఇటీవల రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా తన మనసులోని భావాలను పంచుకుంటూ అజిత్ కుమార్ స్పందిస్తూ..
“ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా దేశానికి చేసిన చిన్నపాటి కృషిని గుర్తించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గౌరవం నాకు మాత్రమే కాదు, నా ప్రయాణంలో తోడ్పడిన సీనియర్‌ హీరోలు, సహచరులు, అభిమానులందరికీ సొంతమైనది.” అని పేర్కొన్నారు.

2025లో అజిత్ సినిమాల విజయయాత్ర
ఈ ఏడాది అజిత్ కెరీర్‌లో మరొక గొప్ప మైలురాయిగా నిలిచింది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో వచ్చిన “విడాముయర్చి”, అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన “గుడ్ బాడ్ అగ్లీ” చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.

మోటార్‌స్పోర్ట్స్ లో అజిత్ కొత్త విజయాలు
సినిమా రంగంతో పాటు, మోటార్‌స్పోర్ట్స్‌లోనూ అజిత్ కుమార్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన టీం “అజిత్ కుమార్ రేసింగ్” జనవరిలో అబు ధాబీలో జరిగిన 24 గంటల రేసులో 991 విభాగంలో మూడవ స్థానం సాధించింది. అంతేకాకుండా, “స్పిరిట్ ఆఫ్ ది రేస్” అనే ప్రత్యేక పురస్కారాన్ని కూడా గెలుచుకుంది.

అంతేకాదు, బెల్జియంలోని ప్రసిద్ధ రేసింగ్ ట్రాక్ స్పా-ఫ్రాంకోర్చాంప్స్ లో జరిగిన మరో రేసులో అజిత్ టీం రెండవ స్థానం అందుకుంది. ఈ విజయాలతో అజిత్ మోటార్‌స్పోర్ట్స్‌లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.

Leave a Reply