ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన రీతూ చౌదరి, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై స్పందించింది. యూట్యూబ్ వీడియోలతో పాటు, ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే, ఇటీవల జరిగిన బెట్టింగ్ యాప్స్ వివాదంలో రీతూ చౌదరి పేరు ప్రస్తావనలో వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించింది.
ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు విచారణకు గురయ్యారు. రీతూ చౌదరి కూడా ఈ అంశంపై ఆమె స్పష్టత ఇచ్చింది. “నేను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని చెప్పను. కానీ అనేక యాప్స్ ను ప్రమోట్ చేయడం చూసిన తర్వాత, అది తప్పు అని నాకు అర్థమైంది,” అని పేర్కొంది.
View this post on Instagram
“ఆ సమయంలో నాకు అవగాహన లేదు. ఇప్పుడు అర్థం అయ్యిన తరువాత నేను ప్రమోట్ చేసిన యాప్స్ గురించి చాలా తక్కువగా చెప్తాను. ఇంక ఎప్పుడూ వాటి జోలికి వెళ్ళను.. నాకు ఒక్కో వీడియోకు 50 వేల నుంచి 60 వేల వరకు మాత్రమే రెమ్యునరేషన్ వచ్చింది,” అని రీతూ చౌదరి చెప్పింది.
అదనంగా, రీతూ గతంలో తన సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీకాంత్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. ఈ ఇద్దరి మధ్య పెళ్లి జరిగిందని వస్తున్న వార్తలపై కూడా రీతూ స్పందించింది. “నాకు పెళ్లి అవ్వలేదు. ఆ పెళ్లి ఫోటోలు గురించి నేను మాట్లాడను.. అవి నా పర్సనల్ విషయాలు,” అని క్లారిటీ ఇచ్చింది.