Lavanya: పోలీస్ స్టేషన్ ముందు లావణ్య హల్‌చల్.. న్యాయం చేయకపోతే ఇక్కడే చనిపోతా..!

హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లోకెక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె అనూహ్యంగా హల్‌చల్ చేశారు. “పోలీసులు న్యాయం చేయట్లేదు.. ఇంకా ఇలానే ఉంటే పోలీస్ స్టేషన్‌ ఎదుటే ప్రాణాలు తీసుకుంటా” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఆమెపై దాడి జరిగినా, ఇప్పటికీ పోలీసులు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

లావణ్య చెబుతున్న దాని ప్రకారం, నిన్న రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారట. అయితే, ఇది రాజ్ తరుణ్, అతడి తల్లిదండ్రులతో మొన్న జరిగిన ఘటనకు కొనసాగింపుగా అభిప్రాయపడుతోంది. అప్పుడే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మొత్తం 15 మంది కలిసి తనపై దాడికి పాల్పడ్డారని లావణ్య ఆరోపిస్తున్నారు. కోకాపేట్‌లోని తన నివాసం వద్ద ఈ దాడి జరిగిందని వివరించారు. “వాళ్లు నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి వస్తువులు ధ్వంసం చేశారు.. నన్ను బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు” అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనకు ప్రాణహాని ఉందని లావణ్య చెబుతున్నప్పటికీ, పోలీసులు స్పందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బాధను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయం చేయకపోతే.. పోలీస్ స్టేషన్‌లోనే ప్రాణాలు విడుస్తా’’ అంటూ మీడియా ముందు విచారం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్‌తో ఉన్న పాత వివాదం పరిణామాల దిశగా మారుతుండగా, లావణ్య ఫిర్యాదు పోలీసు వ్యవస్థపై అనేక ప్రశ్నలు లేపుతోంది.

Leave a Reply