ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆమె, గాయత్రీ నిలయంలో బస చేసి, సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటంతో, అన్నా లెజినోవా మొక్కులు తీర్చుకునే ఉద్దేశంతో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీభూవరాహస్వామి ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించిన ఆమె, కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్పై సంతకం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు.
శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించిన శ్రీమతి అన్నా కొణిదల గారు. pic.twitter.com/ELBA9IN1EC
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025
తిరుమలలో టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ ఘటనకు నేపథ్యంగా, ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉండగా, హుటాహుటిన సింగపూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కూడా అక్కడికి చేరుకున్నారు.
Andhra Pradesh Deputy CM Sri @PawanKalyan Garu’s wife, Smt. Anna Konidala, visited Tirumala today.
She signed the declaration forms at Gayatri Sadan in the presence of @TTDevasthanams staff. pic.twitter.com/am3hxHWfHH
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025
తన కుమారుడి ఆరోగ్యం మెరుగుపడటంతో, పవన్ కళ్యాణ్ భార్య లెజినోవా ధర్మస్థాన సందర్శన చేసి, తలనీలాలు సమర్పించడం ఇప్పుడు పలు వర్గాల్లో చర్చనీయాంశమైంది.