గుజరాత్తో జరిగిన కీలక మ్యాచ్లో ఓటమి చవి చూసిన రాజస్థాన్ రాయల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిన ఆర్ఆర్కి బీసీసీఐ షాకింగ్ జరిమానా విధించింది.
మ్యాచ్లో రాజస్థాన్ జట్టు స్లో ఓవర్ రేట్కు పాల్పడడంతో కెప్టెన్ సంజూ శాంసన్కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతేకాదు, ప్లేయింగ్-11లోని మిగిలిన ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్తో సహా) ఒక్కోరికి రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం – ఏది తక్కువగా ఉంటే అదే జరిమానాగా చెల్లించాల్సి వస్తుందని ఐపీఎల్ ప్రకటనలో వెల్లడించింది.
ఇది రాజస్థాన్కు ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్ జరిమానా కావడం గమనార్హం. గతంలో చెన్నైతో మ్యాచ్లోనూ ఇదే సమస్య తలెత్తగా, తాత్కాలిక కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
Sanju Samson fined 24 Lakhs for maintaining slow overrate. pic.twitter.com/BaoDW0gKfW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025
మ్యాచ్ విషయానికి వస్తే… గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగులు చేసి రాజస్థాన్కి భారీ లక్ష్యం విసిరింది. జోస్ బట్లర్ (36), షారుక్ ఖాన్ (36)లు కూడా మెరుగైన స్కోరు అందించారు.
ఆర్సీఆర్ బౌలింగ్ వైపు తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. ఆర్చర్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ తీసారు.
లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విఫలమైంది. హెట్మెయర్ (52), సంజూ శాంసన్ (41) మెరుగైన ప్రయత్నం చేసినప్పటికీ మిగిలిన బ్యాటర్ల విఫలతతో 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, అవేశ్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.