ఇంగ్లాండ్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. 26 ఏళ్ల యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ వైట్ బాల్ ఫార్మాట్లకు (వన్డే, టీ20) పూర్తి స్థాయి కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) కొత్త నాయకత్వానికి పచ్చ జెండా ఊపింది. మే 2025 నుంచి బ్రూక్ అధికారికంగా జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇప్పటివరకు జోస్ బట్లర్ ఆధ్వర్యంలో పలు విజయాలను నమోదు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆ టోర్నీ ఫలితాల అనంతరం బట్లర్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. అప్పటి నుంచి కొత్త కెప్టెన్పై పలు ఊహాగానాలు చెలరేగాయి. బెన్ స్టోక్స్ పేరూ చర్చలలో వినిపించినా.. ECB చివరికి హ్యారీ బ్రూక్పై నమ్మకం పెట్టుకుంది.
హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి, వేగంగా జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్లు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే 2023లో బ్రూక్ను వైట్ బాల్ ఫార్మాట్లలో వైస్ కెప్టెన్గా ECB నియమించింది. అంతేకాక, 2018లో జరిగిన అండర్-19 వరల్డ్కప్కి కూడా బ్రూక్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈసీబీ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన బ్రూక్, “ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించడం అనేది నా కల. ఇప్పుడు ఆ కల నిజం కావడం గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ECBకి కృతజ్ఞతలు. నా పూర్తి ప్రతిభను పెట్టి జట్టును విజయాల బాటలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నాను,” అని తెలిపాడు.
💬 “Ever since I was a kid playing cricket at Burley in Wharfedale, I dreamed of representing Yorkshire, playing for England, and maybe one day leading the team. To now be given that chance means a great deal to me.”
A dream realised for Brooky 🙌 pic.twitter.com/dsYhjM2cZT
— England Cricket (@englandcricket) April 7, 2025
అతడి నాయకత్వం ఎలా ఉంటుందనేది చూడాలి.. బ్రూక్ లాంటి యంగ్ & డైనమిక్ పర్సన్ ని కెప్టెన్ గా ఎంపిక చేయడం ద్వారా ECB కొత్తతరం వైపు అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. త్వరలో ఇంగ్లాండ్ జట్టు తన కొత్త నాయకుడితో మైదానంలో ఎలా ఆడుతుందో చూడాలి.