చెన్నై సూపర్ కింగ్స్ తలా ఎంఎస్ ధోని పేరు వింటేనే అభిమానులు ఫీల్ అవుతారు. వరల్డ్ కప్లు, ఐపీఎల్ టైటిల్స్, కోల్డ్ ఫినిషింగ్ స్టైల్… ఎన్నో చిరస్మరణీయ క్షణాలు తన బ్యాటుతో అభిమానులకు అందించిన ఈ లెజెండ్ ఇప్పుడు కెరీర్ ముగింపు దశలో ఉన్నాడన్న భావన అభిమానులను కలచివేస్తోంది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ మూడు మ్యాచ్లు ఆడగా, ఒక్కదానిలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో వారి నాలుగో మ్యాచ్ చెన్నైలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కంటే ఎక్కువ హైలైట్ అయ్యిందొక వీడియో – అదే ధోని తల్లిదండ్రులు ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రత్యక్షంగా కనిపించడం.
ఈ అరుదైన దృశ్యం చూసిన వెంటనే సోషల్ మీడియాలో రిపోర్టులు మొదలయ్యాయి – ఇదే ధోని చివరి హోం మ్యాచ్ కావచ్చు, తల్లిదండ్రులు వచ్చారంటే రిటైర్మెంట్ ఫిక్సేనా? అని అభిమానులు భావోద్వేగంగా పోస్టులు పెడుతున్నారు. ధోనికి ఇదే చివరి సీజన్ అవుతుందన్న ప్రచారం గత రెండేళ్లుగా ఉంది. కానీ ఈసారి పరిస్థితులు కాస్త రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి.
ధోని ఇప్పటివరకు ఐపీఎల్లో 267 మ్యాచ్లు ఆడి, 5,289 పరుగులు చేశాడు. చెన్నై తరఫున 237 మ్యాచ్ల్లో 4,715 పరుగులతో చురుకైన కెప్టెన్గా, బ్యాట్స్మన్గా తనదైన ముద్ర వేశాడు. 137+ స్ట్రైక్ రేట్, 40+ సగటుతో చివర్లో ఓ బెస్ట్ ఫినిషర్గా నిలిచాడు.
Dhoni’s parents at Chepauk #WhistlePodu #IPL #CSK @MSDhoni pic.twitter.com/SV7ucNHn6V
— MSDian™ (@ItzThanesh) April 5, 2025
అయితే ప్రస్తుత సీజన్లో ధోని సాధారణంగా క్రీజులో ఎక్కువ సమయం గడపడం లేదు. ఓవర్సు చివర్లో మాత్రమే బ్యాటింగ్కు రావడం, కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్కు అప్పగించడం వంటి మార్పులు చూస్తుంటే ఇది ఒక సమయానుకూల తుది నిర్ణయంలా కనిపిస్తోంది.
ఇక ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటంతో, అభిమానుల ఎమోషన్ డబుల్ అయ్యింది. తలా చివరిసారి తమ కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తున్నారేమో అనే భావన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వాతావరణంలో ధోనిని మళ్లీ చూడగలమా? లేక ఈ ఐపీఎల్తోనే అతని ఆట ముగుస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమానిని వేధిస్తోంది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. ధోని శైలి చూస్తుంటే నిజమే అన్న భావన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.