హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) విద్యార్థుల నిరసన తారాస్థాయికి చేరింది. యూనివర్సిటీ పరిధిలో 400 ఎకరాల అడవిని తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం మిన్నంటుతోంది. దీనికి నిరసనగా విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే, పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
HCU విద్యార్ధులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.
పచ్చని అడవిని నాశనం చేయొద్దని నిరసనకు దిగిన విద్యార్ధులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు. pic.twitter.com/0Cbfbqvilc
— Balka Suman (@balkasumantrs) April 2, 2025
పోలీసుల లాఠీ ఛార్జ్.. విద్యార్థులను ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్!
విద్యార్థుల్ని పట్టుకుని కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విద్యార్థుల నినాదాలు, పోలీసుల బలప్రయోగంతో యూనివర్సిటీ గేటు వద్ద భారీ గందరగోళం నెలకొంది.
లాఠీ ఛార్జ్ వల్ల పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
HCUలో లాఠీఛార్జ్.. pic.twitter.com/rJdR1h7EXh
— Siri Vennela Goud Palle (@VennelaPalle) April 2, 2025
రేవంత్ రెడ్డి సర్కారుపై విద్యార్థుల ఆగ్రహం!
పోలీసుల దౌర్జన్యం నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“పర్యావరణాన్ని రక్షించమంటే మాపై దాడులా?” అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు పేర్కొంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్
HCUలో విద్యార్థులపై మరోసారి లాఠీఛార్జ్
నిరసన తెలుపుతున్న విద్యార్థులను లాఠీలతో చితకబాది.. లాకెళ్తున్న పోలీసులు https://t.co/4p9Bx5mr3r pic.twitter.com/17xek6Ppug
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2025
ఉపాధ్యాయుల మద్దతు.. చిన్నారుల విజ్ఞప్తి
యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.
6వ తరగతి విద్యార్థి “HCU అడవిని వైల్డ్లైఫ్ సాంక్చురీగా ప్రకటించండి” అంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశముందని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు!