బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తన మాటలతో వివాదాస్పదంగా మారారు. మల్లారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకు హీరోగా నటించిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, వేదికపై ఉన్న హీరోయిన్ కసిక కపూర్ గురించి మాట్లాడుతూ, ఆమె “కసికసిగా ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై అక్కడి ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. మల్లారెడ్డి తన సహజమైన మాస్ స్టైల్లో మాట్లాడినప్పటికీ, హీరోయిన్లకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
మల్లారెడ్డి ఈ ఈవెంట్లో మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, తాను వాటికి హాజరుకాకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్కు వచ్చానని చెప్పడం వివాదాన్ని మరింత పెంచింది. అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత కలిగినవే అయినా, వాటిని పక్కన పెట్టి సినిమాల ప్రమోషన్కు వెళ్లడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారు.
కసికాపూర్ అంట హీరోయిన్ మంచి కసి కసిగా ఉన్నది .
– మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి.అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరి సినిమ ఫంక్షన్ కి హాజరైన మల్లారెడ్డి విద్యాసంస్థలు అధినేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్ల రెడ్డి pic.twitter.com/oEMY0o10sT
— Telangana365 (@Telangana365) March 28, 2025
సామాజిక మాధ్యమాల్లో మల్లారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. “ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాసమస్యలపై చర్చించాల్సింది పోయి హీరోయిన్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మల్లారెడ్డి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రాబిన్హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో నితిన్తో కలిసి స్టేజ్పై డ్యాన్స్ చేసిన ఆయన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు.
ఇటీవలే మల్లారెడ్డి వివిధ అంశాలపై తన బోల్డ్ స్టేట్మెంట్స్తో సంచలనంగా మారారు. తన మాస్ బాడీ లాంగ్వేజ్, నిరభ్యంతరంగా మాట్లాడే తీరు ప్రజలకు వినోదంగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు విమర్శలకు గురవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు భాద్యత గల పదవిలో ఉన్నప్పుడు ప్రజలకి ప్రాతినిధ్యం వహించటం పోయి ఇలా పబ్లిక్ గా స్టేజ్ మీద మాట్లాడటం మంచి పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.