IPL 2025లో రిషబ్ పంత్ ఆటతీరు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది. అతని బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడం, కీలక మ్యాచ్లలో విఫలమవడం కొందరిని నిరుత్సాహపరిచింది. అయితే, ఈ నిరాశ లైవ్ టీవీలో ఓ క్రికెట్ జర్నలిస్టు కట్టిపడేసే విధంగా ప్రదర్శించడంతో అది సంచలనంగా మారింది. తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన ఆ యాంకర్, లైవ్ షోలోనే టీవీపై వస్తువు విసిరి పగలగొట్టి, టేబుల్ను తోసిపారేశారు.
భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఒక మతంలా భావిస్తారు. జట్టు గెలిస్తే ఆనందోత్సాహంగా ఉంటారు, ఓడితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అయితే, ఈ అభిమానానికి ఒక పరిమితి ఉండాలి అనే చర్చ ఈ సంఘటన తర్వాత మళ్లీ మొదలైంది.
IPL 2025లో LSG కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ తన బ్యాటింగ్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా SRHతో జరిగిన మ్యాచ్లో అతని ప్రదర్శన నిరాశపరిచింది. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతను, ఈ మ్యాచ్లో కేవలం 15 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ ప్రముఖ స్పోర్ట్స్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన క్రికెట్ చర్చా కార్యక్రమంలో రిషబ్ పంత్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్ విశ్లేషకుడు విక్రాంత్ గుప్తా పాల్గొన్న ఈ చర్చలో ఓ జర్నలిస్టు తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు.
పంత్ ప్రదర్శన అసహనం కలిగిస్తోంది, అతను పూర్తిగా ఊహించగలిగే ఆటగాడిగా మారిపోయాడు అంటూ ఆగ్రహావేశంతో మాట్లాడిన ఆ జర్నలిస్టు టీవీని పగలగొట్టడంతో పాటు, స్టూడియోలోని టేబుల్ను తోసిపారేశారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.
sports tak 😭😭 pic.twitter.com/JjyXxGeiw7
— Pr𝕏tham (@Prxtham_18) March 27, 2025
ఈ ఘటనపై అభిమానుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది క్రికెట్ అంటే ఒక ఎమోషన్, ఇది సహజమే అని యాంకర్ చర్యను సమర్థించారు. మరికొందరు కేవలం ఒక ఆటగాడు ఫెయిల్ అయినందుకు ఇంత రియాక్షన్ అవసరమా అని ప్రశ్నించారు. కొన్ని కామెంట్లు ఇది పాకిస్తాన్ అభిమానుల మాదిరిగా టీవీలు పగలగొట్టే స్థాయికి వెళ్ళిపోతోందా అని సెటైర్లు వేశాయి.
ఈ సంఘటన మరోసారి భారత క్రికెట్ అభిమానుల భావోద్వేగాలను బయట పెట్టింది. అయితే, ఒక ఆటపై ఇంతగా రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక ఆటగాడి ప్రదర్శనపై విమర్శలు సహజమే, కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఇంత రియాక్షన్ అవసరమా?
ఈ ఘటనతో క్రికెట్ పై ప్రేమ కూడా విధి విధానాలు పాటించాల్సిన అవసరం ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.