టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ పేరు బెట్టింగ్ యాప్ కేసులో తెరపైకి రావడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా విజయ్ పీఆర్ టీమ్ స్పందించింది. విజయ్ దేవరకొండ కేవలం చట్టపరంగా అనుమతించబడిన స్కిల్ బేస్డ్ గేమ్స్కే ప్రచారం చేసాడని, A23 అనే లీగల్గా గుర్తింపు పొందిన సంస్థకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడని స్పష్టం చేసింది.
ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యూట్యూబర్లతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ, అనన్య నాగల్ల, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పావని వంటి 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ స్పందిస్తూ, ఆయన కేవలం లీగల్గా అనుమతించబడిన స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించాడని స్పష్టం చేసింది. విజయ్ ఏ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నా, ఆ సంస్థ పూర్తిగా చట్టబద్ధంగా ఉందో లేదో తన టీమ్ ముందుగా పరిశీలిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అనే విషయాన్ని గతంలో స్పష్టం చేసిందని, అందుకే విజయ్ A23 సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడని తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడంపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం
చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడు
విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్… https://t.co/wrr3Fi2vG6 pic.twitter.com/wsGAV8IwME
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025
అయితే, విజయ్ దేవరకొండ డీల్ గత ఏడాదితోనే ముగిసిందని, ప్రస్తుతం ఆయనకు A23 లేదా ఏదైనా బెట్టింగ్ యాప్లతో ఎలాంటి సంబంధం లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. అందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, విజయ్ ఎప్పటికీ ఎటువంటి ఇల్లీగల్ యాప్కు ప్రచారం చేయరని స్పష్టం చేశారు.
ఈ వివాదం ఇంకా ముదిరితే, విజయ్ దేవరకొండ సహా ఇతర సెలబ్రిటీలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. అభిమానులు, సినీ పరిశ్రమ ఇప్పుడు ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుందో ఆసక్తిగా గమనిస్తున్నారు.