Nayanthara: రూ.100 కోట్ల విలాసవంతమైన ఇంటి యజమానిగా నయనతార-విఘ్నేష్ దంపతులు!

టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఈ స్టార్ దంపతులు చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో రూ.100 కోట్ల విలువైన భవంతిని కొనుగోలు చేశారు. అయితే ఇది సాధారణ ఇల్లు కాదు. స్టూడియో తరహాలో ప్రత్యేకంగా డిజైన్ చేయించడంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ ఇంటి విస్తీర్ణం దాదాపు 7,000 చదరపు అడుగులు. సంప్రదాయ భవంతులతో పోలిస్తే, ఇది సినిమాటిక్ లుక్‌తో, స్టూడియో ఫీల్ వచ్చేలా డిజైన్ చేయించారని సమాచారం. ఇంట్లో అత్యాధునిక ఆర్కిటెక్చర్, హస్తకళలు, ట్రెండీ డిజైన్లు, ప్రాక్టికల్ ఇంటీరియర్, పెద్ద గాజు కిటికీలు, ప్రకృతి మయం చేసే చెట్లు ఉన్నాయి. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగానే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

నయనతార ప్రస్తుతం సినిమాలు, యాడ్స్, ప్రొడక్షన్, బిజినెస్.. ఇలా అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఆమె 80కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ హోదా సంపాదించుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను పూర్తిగా కొనసాగిస్తూ, ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె సుందర్.సి దర్శకత్వంలో “మూక్కుతి అమ్మన్ 2” చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, “మన్నంకట్టి”, “డియర్ స్టూడెంట్స్”, “టాక్సిక్”, “రాకాయ్” వంటి సినిమాల్లోనూ ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది.

నయనతార తదుపరి చిత్రం “టెస్ట్” 2025 ఏప్రిల్ 4న విడుదల కానుంది. శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పోయెస్ గార్డెన్‌లో ఇల్లు అంటే చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రదేశాల్లో ఒకటి. అగ్ర నటులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అక్కడ నివసిస్తారు. నయన్-విఘ్నేష్ లగ్జరీ హౌస్ కొనుగోలు చేయడం, దాన్ని స్టూడియో తరహాలో డిజైన్ చేయించుకోవడం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచింది. ఈ డ్రీమ్ హౌస్‌తో నయన్-విఘ్నేష్ కొత్త స్టెప్ తీసుకున్నారు. మరి, ఈ స్టార్ కపుల్ భవిష్యత్తులో ఇంకేం చేస్తారో చూడాలి.

Leave a Reply