నందమూరి కళ్యాణ్ రామ్, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. తల్లీ కొడుకుల అనుబంధం, విభేదాలు, భావోద్వేగాలు, ప్రతీకారం.. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే కథలో నటీనటుల శక్తివంతమైన ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
టీజర్ చూస్తే, ఈ సినిమా ఓ కుటుంబ నేపథ్యంతో పాటు, సున్నితమైన భావోద్వేగాలను మేలవించి రూపొందించిన అద్భుతమైన యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా మునుపెన్నడూ కనిపించని శైలిలో కనిపిస్తున్నారు. మరోవైపు విజయశాంతి, తనదైన శైలిలో శక్తివంతమైన పాత్రలో మెప్పించనున్నారు. పోలీస్ అధికారిణిగా ఆమె చేసే పోరాటం, తన కొడుకుతో ఉన్న భావోద్వేగ భరిత సంబంధం టీజర్లో ప్రధాన హైలైట్గా నిలిచింది.
సాంకేతికంగా, ఈ సినిమా హై స్టాండర్డ్స్ను మెయింటైన్ చేస్తోంది. రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్లో వినూత్నమైన విజువల్స్, యాంగిల్స్ సినిమాటోగ్రఫీ పరంగా హైలైట్ కానున్నాయి. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథానాయిక పాత్రలోని తీవ్రతను, కథలోని ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముప్పా అశోక్ వర్ధన్, సునీల్ బాలుసు లాంటి ప్రతిష్టాత్మక నిర్మాతలు ఈ సినిమాను నిర్మించడంతో, భారీ స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్తో తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. కథలోని మిస్టరీ, భావోద్వేగ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. మేకర్స్ త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మనసులను ఎంతలా దోచుకుంటుందో చూడాలి!