Naayak: మళ్లీ థియేటర్లలో ‘నాయక్’ – రీ-రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. స్టార్ హీరోల హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలవుతూ ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్‌గా మారుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘నాయక్’ (Naayak) మార్చి 27న రీ-రిలీజ్ కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ప్రత్యేకంగా మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు.

ఈ సినిమాలో అమలా పాల్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి హాస్యపాత్రలు పోషించారు. ప్రతి ఏడాది రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తారు. అయితే ఈసారి మరింత భిన్నంగా ‘నాయక్’ను రీ-రిలీజ్ చేసి మళ్లీ సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వీవీ వినాయక్ కూడా ఈ రీ-రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి. అలాగే, ఛార్మీ చేసిన స్పెషల్ సాంగ్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 2013 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నాయక్’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు సాధించింది. ఇక రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా కావడం వల్ల, మెగా ఫ్యాన్స్‌కి ఎప్పుడూ స్పెషల్ మూవీగా నిలిచింది. మళ్లీ థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఈసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ తాజా సినిమా ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా, నిరాశపరిచింది. అందుకే ఆలస్యం చేయకుండా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ పేస్ షూటింగ్‌లో ఉంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రాండ్ కాస్ట్ & క్రూ‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ, రామ్ చరణ్‌కి ఎంతవరకు హిట్ అందిస్తుందో చూడాలి.

ఇంకా, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో RC17 తెరకెక్కనుంది. పక్కా ప్లానింగ్‌తో వరుస సినిమాల‌తో రామ్ చరణ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు!

Leave a Reply