CM Siddaramaiah: విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఉపాధ్యాయుడు సస్పెన్షన్
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఉపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యారు.
కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన సిద్ధరామయ్య ప్రభుత్వం, కాంగ్రెస్ విధానాలను విమర్శించిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని
శనివారం సస్పెండ్ చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునే అధికారులు సస్పెన్షన్ను జారీ చేశారు.
చిత్రదుర్గ జిల్లా హోసదుర్గలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు శాంతమూర్తి ఎంజీ తన ఫేస్బుక్లో
కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ విధానాలను, ఎన్నికల సమయంలో ఉచిత పంపిణీని ప్రశ్నిస్తూ తన ఆవేదనను పోస్ట్ చేశారు.
తన సస్పెన్షన్కు దారితీసిన సోషల్ మీడియాలో, వివిధ ముఖ్యమంత్రుల హయాంలో కర్ణాటక చేసిన అప్పుల గురించి రాశారు.
అయితే వివిధ ముఖ్యమంత్రుల హయాంలో ఎంతెంత అప్పు చేశారో వివరంగా రాసుకొచ్చాడు. ‘‘మాజీ సీఎంల హయాంలో.
. ఎస్ఎం కృష్ణ రూ.3,590 కోట్లు, ధరమ్సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప
రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ.2 కోట్లు, సిద్ధరామయ్య రూ.41 కోట్లు.. 42,000 కోట్లు” అని శాంతమూర్తి పోస్ట్లో పేర్కొన్నాడు.
అయితే ఇది కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని విమర్శించడమేనని.. ఈ మేరకు క్షేత్ర విద్యాశాఖాధికారి ఎల్.జయప్ప శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
“శనివారం కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో గత ప్రభుత్వాల హయాంలో చేసిన
అప్పులను CM Siddaramaiah: ప్రస్తావించడం ద్వారా ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారు.
అందుకే ఆయనను సస్పెండ్ చేశాం” అని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపారు.
కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో ,136 సీట్ల ఆధిక్యత తో విజయం సాధించి.
కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే ,కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం గా డీకే శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
వీరితో పాటుగా మరో 8 మంది మంత్రులుగా CM Siddaramaiah: ప్రమాణ స్వీకారం చేశారు.