KTR: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే

KTR

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే: KTR

KTR: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మహింద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌న్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.

ఈ తరుణంలో మంత్రి మాట్లాడుతూ రూ.1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మున్ముందు ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామన్నారు.

ఐటి అభివృద్ది దిశగా తెలంగాణ

టీఎస్ ఐ-పాస్ ద్వారా 21 రోజుల్లో పరిశ్రమ స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తున్నామన్నారు KTR. టీఎస్ ఐ-పాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 23వేల పరిశ్రమలకు పర్మిషన్స్ ఇచ్చినట్లు KTR తెలిపారు. టీఎస్ ఐ-పాస్ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొత్తగా వచ్చే కంపెనీలలో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.  జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ పెంచుకోవాలని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh