నేడు వారి అకౌంట్లలో డబ్బు జమ

YSR Law Nestham Scheme

నేడు వారి అకౌంట్లలో డబ్బు జమ

ఏపీలోని లాయర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గుడ్ న్యూస్  చెప్పారు.  జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 3వ తేదీన వైఎస్సార్‌ లా నేస్తం‌ పథకాన్ని సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరపడే వరకు దాదాపు మూడేళ్ల పాటు నెలకు రూ.5,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందిస్తోంది. అర్హులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో లా డిగ్రీతో పాటు జనన ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం కింద ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది . కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి వృత్తిలో నిలదొక్కుకుంటున్న యువ లాయర్లకు ‘వైఎస్సార్‌ లా నేస్తం’ కింద ఆర్థిక సాయం అందజేస్తున్న  విషయం అందరకు తెలిసిందే. ఇందులో భాగంగా వరుపగా నాలుగో ఏడాది కూడా ఈ మొత్తాన్ని అందించనున్నారు ఏపీ ప్రభుత్వం . దీనితో  రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది న్యాయవాదులకు లబ్ధి పొందనున్నారు . అయితే అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో  ఈ(రోజు)  బుధవారం రూ. 1,00,55,000 జమ చేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం నెలకు రూ. 5,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత మూడున్నరేళ్లలో వైఎస్సార్‌ లా నేస్తం పథకం కింద మొత్తంగా రూ. 35.40 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh