Trains: ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Trains

Trains:ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Trains: దక్షిణ మధ్య రైల్వే ఈనెల 21 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది.మరికొన్నింటిని దారి మళ్లించింది.

ఖాజీపేట సెక్షన్‌లో పరిధిలో ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.

ఈ నెల 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు పలు రైళ్ల షెడ్యూల్ లో మార్పులు చేసారు.

Also Watch

NTR31: కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్

కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని చింతపల్లి- నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టాల్సి ఉండటంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

రద్దయిన సర్వీసులు : ట్రైన్ నంబర్ 07753 కాజీపేట డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07754 డోర్నకల్ -కాజీపేట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07755 విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్.

ట్రైన్ నంబర్ 07756 డోర్నకల్ – విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07465 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను మే 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రైన్ నంబర్ 17660 భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17659 సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 12713 విజయవాడ-సికింద్రబాద్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్- విజయవాడ ఎక్స్ ప్రెస్ మే 21 నుంచి జూన్ 7వరకు రద్దు అయ్యింది.
పాక్షక్షికంగా రద్దు చేసిన సర్వీసులు
సిర్పూర్ టౌన్ – భద్రాచలం (17034) ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వరంగల్ – భద్రాచలం మధ్య,భద్రాచలం – సిర్పూర్ (17033) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు భద్రాచలం – వరంగల్ మధ్య పాక్షక్షికంగా రద్దు చేశారు.

అలాగే విశాఖపట్నం – ముంబై ఎల్టీటీ (18519) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.

షాలిమార్ – సికింద్రాబాద్ (22849) ఈనెల 24, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది.

యశ్వంత్ పూర్ -టాటా నగర్ (18112) ఈనెల 21, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది.

హైదరాబాద్ – షా,లిమార్ (18046) ఈనెల 28, జూన్ 7వ తేదీల్లో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.

One thought on “Trains: ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh