Pooja:మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు

Pooja:

Pooja:మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు

Pooja: సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్‌ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు.

అసలు వివరాలలోకి వెళ్ళితే సూలూరు సమీపంలోని కురుంబపాళయంలో మణికంఠన్, అతని భార్య, కుమారుడు ఉంటున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అయిన మణికంఠన్ భార్య,కొడుకుని విడిచిపెట్టి మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల ఆ యువతితో గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మణికంఠన్ Pooja: కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని సూలూరుకి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే సరిగ్గా అదే సమయంలో మణికంఠన్ చనిపోయాడనే విషయం అతడి స్నేహితులందరికీ తెలిసింది. అఘోరాగా మారిన చిన్న నాటి స్నేహితుడికి కూడా ఈ సమాచారం చేరింది. వెంటనే తనతో పాటు మరో అఘోరాను తీసుకొని సూలూర్ ప్రాంతానికి వచ్చాడు.అతని ఆత్మశాంతి కోసం కొన్ని పూజలు చేయాలని కుటుంసభ్యులకు చెప్పాడు. వారు అంగీకరించడంతో మణికంఠన్ మృతదేహంపై కూర్చుని ధ్యానం చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ పూజలు చేశాడు. ఈ తతంగం అంతా చూసేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. అఘోర పూజలు పూర్తైన తరువాత మణికంఠన్ అంత్యక్రియలు జరిగాయి. అయితే Pooja: ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh