Modi : తెలంగాణ కు రానున్నమోదీ, అమిత్‌షా, నడ్డా

Modi

Modi : తెలంగాణ కు రానున్నమోదీ, అమిత్‌షా, నడ్డా

Modi : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. మొన్నటి వరకు దూకుడు మీద కనిపించిన బీజేపీ…. ఇప్పుడు డీలా పడినట్లు కనిపిస్తోంది.

కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్… తెగ స్పీడ్ పెంచేసింది. కీలక నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో పడిపోయింది.

బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ కూడా జనాల్లోకి వెళుతున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకోవటంతో పాటు ప్రత్యర్థిని బోల్తా కొట్టించాలని చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టే దిశగా అడుగులువేస్తున్నారు  బీజేపీ పెద్దలు.

ఈ నేపధ్యం లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారని తెలుస్తోంది.

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ పర్యటించనున్నారని సమాచారం. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటకలో ఇటీవల ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రచారంలో భాగంగా బెంగళూరులో 21 కిలోమీటర్ల భారీ ర్యాలీ మోదీ నిర్వహించారు.

అదే తరహాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ మోదీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎప్పుడు తెలంగాణ వస్తారు అన్న విషయం మాత్రం అధికారంగా తెలపలేదు. అయితే ఈ నెలలో ఖచ్చితంగా ఉంటుందని టీ బీజేపీ నేతలు చెబుతున్నారు.

అలాగే ఈ నెల 15న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననుండగా.

నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 25న జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు మోదీ కూడా ఈ నెలలోనే రానున్నారని చెబుతున్నారు.

ఒకే నెలలో ముగ్గురు అగ్రనేతల పర్యటనలతో కాషాయదళంలో సరికొత్త ఉత్సహం నెలకొనే అవకాశముంది.

ఇక మోదీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్‌ షా తో పాటు నడ్డా కూడా హాజరుకానున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh