AP News: ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

AP News

AP News: ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

AP News: సంక్షేమ పధకాలతో  ముందుకు దూసుకుపోతున్న ఏపీ సర్కార్ .  తాము అన్న మాటకు కట్టిబడి వున్నాం అని మరొక సారి ఋజువుచేసుకుంది.  మండలానికి ఒక బాలికల జూనియర్‌ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న  రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. బాలికల జూనియర్ కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతో పాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు – ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది.

అయితే ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ ) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. .కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్‌ కళాశాలలు లేనిచోట ‘ప్లస్‌’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్‌ విద్యాబోధన ప్రారంభించింది.

Also Watch

Pawan Kalyan: నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో

ఈ క్రమంలో 2022-23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్‌ హైస్కూల్స్‌లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్‌’ స్కూళ్లలోనూ ఇంటర్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది.7 వేల ఎస్‌జీటీలు.. 1,752 ఎస్‌ఏలకు అవకాశం దక్కనున్నది.

అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్‌ ప్లస్‌ స్థాయిలో ఇంటర్‌ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్‌ ప్లస్‌లో నియమించనున్నారు.

ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్‌ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్‌ అదనంగా ఇచ్చి జూనియర్‌ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు.

దీనితో దాదాపుగా  6 వేల నుండి 7 వేల మందికి ఎస్జీటీలకు పదోన్నతి సైతం రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియామకం చేపట్టనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెల ఆఖరు లోపు పూర్తి చేయాలని వైసీపీ సర్కారు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh