అక్షయ తృతీయ పండుగ హిందూ మతంలో ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంవత్సరపు అక్షయ తృతీయ బుధవారం, ఏప్రిల్ 30న జరుపుకుంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం “అక్షయ” అంటే నాశనం కానిది. అందుకే ఈ రోజు చేసే శుభ కార్యాల ఫలితాలు చిరకాలం నిలుస్తాయని విశ్వాసం.
లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు, అక్షయ తృతీయ సందర్భంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే ధనం, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతాయని నమ్మకం. మరి ఈ శుభదినాన చేయాల్సిన ముఖ్యమైన చర్యలపై ఓ లుక్కేద్దాం:
అక్షయ తృతీయ రోజున చేయాల్సిన పరిహారాలు:
మంత్రజపం: “ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః” మంత్రాన్ని గణపతిపూజ అనంతరం 108సార్లు జపించాలి.
ఇంటి పరిశుభ్రత: లక్ష్మీదేవి పరిశుభ్రమైన ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. కనుక ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవాలి.
స్వస్తిక్ చిహ్నం: ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవడం మంచిది.
దీపాల వెలుగులు: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి.
గోమతి చక్రం వినియోగం: 11 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో గట్టి మడిచి, ధన ప్రదేశంలో భద్రపరచాలి.
అక్షయ తృతీయ ముందు ఇంటికి తీసుకురావలసిన వస్తువులు:
చీపురు: పూజ సమయంలో కొత్త చీపురును ఉంచుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
ఇత్తడి పాత్రలు: విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఇత్తడి పాత్రలు ఇంటికి తెచ్చుకోవాలి.
వెండి నాణెం/పాత్ర: లక్ష్మీదేవి పూజలో వెండి నాణెం లేదా పాత్రను వినియోగించి, పాయసం నివేదించాలి.
ప్రత్యేక సూచన:
అక్షయ తృతీయ రోజున, బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కాని దానికి తోడు మీ ఇంట్లోని శుభ శక్తులను పెంచే ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల నిజమైన శుభ ఫలితాలు దక్కుతాయి.