PM Modi: ఏపీ, తెలంగాణలో మోదీ టూర్ షెడ్యూల్ ఇదే.. రెండు రాష్ట్రాల్లో మొదలైన నిరసన సెగలు..

 ఏపీ, తెలంగాణలో పీఎం మోదీ టూర్……..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈ నెల 11,12 తేదీల్లో విశాఖలో పలు కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు ప్రధాని. 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తెలంగాణకు వస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రయాణ ప్రణాళిక ప్రకారం, ప్రధాని నవంబర్ 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు మరియు వెంటనే తూర్పు నావికాదళ కమాండ్‌లోని చోళ సూట్‌కు రాత్రి హాల్ట్ కోసం వెళతారు.

నవంబర్ 12న ఉదయం 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో మోదీ వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

తర్వాత, మధ్యాహ్నం 12.05 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరే ముందు ప్రధాని అదే వేదిక నుండి బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు.

10,842 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించనున్నారు.

ప్రాజెక్టులు: రైల్వే రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (₹460 కోట్లు), ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ (₹152 కోట్లు), షీలా నగర్ మరియు కాన్వెంట్ జంక్షన్ మధ్య రోడ్డు విస్తరణ (₹566 కోట్లు), శ్రీకాకుళం నుండి గెయిల్ పైప్‌లైన్ వేయడం అంగుల్‌కు (₹2,658 కోట్లు), ఇచ్ఛాపురం మరియు పర్లాకిమిడి మధ్య రోడ్డు విస్తరణ (₹211 కోట్లు), తూర్పు ఆఫ్‌షోర్‌లో ONGC ఫీల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (₹2,917 కోట్లు) మరియు విశాఖపట్నం-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్‌లోని AP విభాగం (₹3,778 కోట్లు).

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మోడీ బహిరంగ సభకు జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. “ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానితో రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి పిచ్ చేసే అవకాశం ఉంది మరియు దాని కోసం కేంద్ర సహాయాన్ని కోరుతుంది” అని వైఎస్సార్సీపీ నాయకుడు అజ్ఞాత షరతుతో అన్నారు.

తెలంగాణలో నిరసనలు..

శనివారం ప్రధాని రాక సందర్భంగా రామగుండంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ప్రధాని పర్యటనను వ్యతికేకిస్తోంది టీఆర్‌ఎస్‌. మోదీ పర్యటనకు నిరసనగా సింగరేణి కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు రెడీ అవుతున్నారు. శుక్రారం, శనివారం సింగరేణిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామగుండం, శ్రీరాంపూర్‌, మందమర్రిలో నిరసనలు చేస్తున్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. మరోవైపు ఈనెల 12 ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ జేఏసీ తీర్మానించింది. ఆ రోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలతో ఆందోళన చేపట్టనున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలా అడుగుపెడుతారని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రశ్నించింది.

పోలీస్‌ వలయంలో విశాఖ నగరం

మరో వైపు పోలీస్‌ వలయంలా మారింది విశాఖ నగరం. ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో.. విశాఖ నగరంలో హై టెన్షన్‌ నెలకొంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు.. అయితే అనుమతి లేదంటూ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు.

ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన షెడ్యూల్ ఇలా..

ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారికంగా వివరాలు వెల్లడించింది. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)ను ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండంలో ఆర్‌ఎ్‌ఫసీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారని తెలిపింది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని పేర్కొంది. రూ.2,200 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి 765డీజీపై మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌, ఎన్‌హెచ్‌-161బీబీపై బోధన్‌-బాసర-భైంసా సెక్షన్‌, ఎన్‌హెచ్‌-353సీపై సిరొంచా-మహదేవ్‌పూర్‌ సెక్షన్‌ రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. ఈ జాతీయ రహదారుల విస్తరణకు పనుల శంకుస్థాపనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విజ్ఞప్తికి పీఎంఓ ఆమోదం తెలిపింది. శంకుస్థాపన అనంతరం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh