తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదు కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Taj mahal:తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదు కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్‌ తన నాలుగో భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్‌ అంటే షాజహాన్‌కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు.

అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్‌ మహల్‌ ప్రేమకు తాజ్‌ మహల్‌ నిదర్శనంగా భావిస్తే మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్‌ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్‌ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు.

కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్‌లను కూల్చివేసి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు.

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వాస్తవానికి మొఘలలు 1526లో భారతదేశానికి వచ్చారు. ఆ తరువాత వారు తాజ్ మహల్‌ను నిర్మించారు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ కోసం తాజ్‌మహల్ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ తాజ్ మహల్‌ను ప్రేమకు సాక్ష్యంగా భావిస్తున్నారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం.. తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం కాదని అన్నారు. అస్సాం రాష్ట్రం మరియాని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రూప‌జ్యోతి కుర్మీ. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మరియాని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021 సంవత్సరంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. మళ్లీ మరియాని నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ప్రస్తుతం తాజ్‌మహల్‌ను కూలగొట్టాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh