భారత్ పై ఆసీస్ ఘనవిజయం

విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టుని ఓడించేసింది ఆస్ట్రేలియా. 10 వికెట్ల తేడాతో అలవోకగా భారత్ జట్టుపై ఆస్ట్రేలియా పై చేయి సందించింది.    కాగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 26 ఓవర్లలో 117 పరుగులకే అందరూ అల్అవుట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఆ లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఒక్క  వికెట్ కూడా నష్టపోకుండా చేదించేసింది. కాగా వాంఖడే వేదికగా గత శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దాంతో మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమవగా ఇక విజేత నిర్ణయాత్మక లాస్ట్ వన్డే బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్ లో 118 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడేశారు.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66 నాటౌట్: 36 బంతుల్లో 6×4, 6×6), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్: 30 బంతుల్లో 10×4) ఫస్ట్ నుంచే టాప్‌గేర్‌లో ఆడుతూ పోటీపడి మరీ హిట్టింగ్ చేసేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టగా మూడో ఓవర్‌లో షమీకి మిచెల్ మార్ష్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో సిరాజ్‌కి ట్రావిస్ హెడ్ వరుసగా 4, 4, 4, 4 బాదేయడం గమనార్హం.

ఇక ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యాకి మిచెల్ మార్ష్ చుక్కలు చూపించేశాడు. ఆ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన మార్ష్ కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ని కూడా ఈ ఓపెనర్లు వదల్లేదు. అంతకముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వెళ్లింది. రోహిత్ శర్మ (15), శుభమన్ గిల్ (0), సూర్యకుమార్ యాదవ్ (0), కేఎల్ రాహుల్ (9) పవర్ ప్లేలోనే వరుసగా మిచెల్ స్టార్క్ దెబ్బకి పెవిలియన్‌కి చేరిపోయారు.అయితే.. విరాట్ కోహ్లీ (31: 35 బంతుల్లో 4×4) కాసేపు క్రీజులో నిలిచి స్కోరు చేయగా.. చివర్లో అక్షర్ పటేల్ (29 నాటౌట్: 29 బంతుల్లో 1×4, 2×6) రెండు సిక్సర్లతో పరువు కాపాడాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్కార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. అలానే సీన్ అబాట్ మూడు, నాథన్ ఎలిస్ రెండు వికెట్లు తీశారు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh