కేటీఆర్‌ గారు మాకు కావాలి మెట్రో.. పెరగనున్న ఆదాయం

నగరవాసుల ప్రయాణ బాధల్ని తీరుస్తూ లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్‌ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది . అయితే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మెట్రో రైలు కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో తమ ప్రాంతాలకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని రంగారెడ్డి, మేడ్చల్ ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కోరుతున్నారు. రామోజీ ఫిలిం సిటీకి మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తే టూరిజం ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని ఎమ్మెల్యేలు కేటీఆర్ కు వివరించారు.

కాగా ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్‌కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కొంగర కలాన్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకాలాపాలు ప్రారంభమైనందున సాగర్ రింగ్ రోడ్డు మీదుగా తుర్కయాంజల్, ఆదిభట్ల కొంగర్ కలాన్ వరకు మెట్రో రైలు నడపాలని రంగారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కోరారు.

అయితే ఇక పై నుంచి మెట్రో రైల్ స్టేషన్లలో టాయిలెట్ వినియోగం ఫ్రీ కాదని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, ప్రస్తుతానికి కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి.

మెట్రో పొడిగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh